KMR: గాంధారి మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద శనివారం సాయంత్రం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని గ్రామస్థులు నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుండి ప్రత్యేకంగా 20 మంది మల్లయోధులు తరలివచ్చారు. స్థానిక మరియు పొరుగు రాష్ట్ర మల్లయోధుల మధ్య జరిగిన ఈ పోరాటాలు అత్యంత హోరాహోరీగా, రసవత్తరంగా సాగి ప్రేక్షకులను అలరించాయి.