GDWL: జిల్లా యాసంగి క్రాప్ బుకింగ్లో 94.76% నమోదుతో రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించిందని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1,73,707 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఇప్పటికే 1,64,603 ఎకరాల నమోదు ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. మిగిలి ఉన్న 9,104 ఎకరాల నమోదును ఈ నెల 30లోగా చెయ్యాలన్నారు.