JN: పాలకుర్తి మండలం దుబ్బా తండాగ్రామానికి చెందిన భూక్య వెన్నలాకు సంచార చేపల విక్రయ వాహనాన్ని సోమవారం అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ మహిళలకు ఆర్థిక బలం అందిస్తున్నాయని, మహిళలు వాటి ద్వారా కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపించగలరని తెలిపారు.