MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన సాదిక్ పాషా ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న BRS జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు శనివారం మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS శ్రేణులు ఉన్నారు.