VZM: తమన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ విజయనగరం మండలం, గుండాలపేట గ్రామంలో ఉచిత వైద్యశిబిరం వి డెంటల్ కేర్, శ్రీనిధి మల్టీస్పెషలిటీ హాస్పిటల్, పుష్పగిరి కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కంది జగదీశ్వరి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రదీప్, శ్రీనిధి భానుప్రసాద్, భీమ్ శంకర్, ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణరావు పాల్గొన్నారు.