MNCL: బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏప్రిల్ 7న మంచిర్యాలలో 24 గంటల నిరవధిక దీక్ష చేపట్టనున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా దేశంలో బీసీ ఉద్యమాలు నడుస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.