ATP: జిల్లాలో సర్వజన ఆసుపత్రిలో ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడుతూ.. ఆసుపత్రిలో అంతిమ వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడమే ‘జీరో వేస్ట్’ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.