RR: గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ దోమల బెడదపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నిధులతో వంద రోజుల దోమలపై యుద్ధం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, వివేకానంద నగర్ కాలనీలో చర్యలు చేపట్టినట్లుగా వివరించారు. నగరంలో దోమల బెడదతో కంటికి కునుకు ఉండటం లేదని, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.