GNTR: గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం పరిశీలించారు. మస్తాన్ దర్గా వెనుక ఉన్న గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని, ఏటి అగ్రహారం 13వ లైన్లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను సీఎస్ఆర్ నిధులతో ఆధునికరించడం జరిగింది. పలు హాస్టల్ను కలెక్టర్ పరిశీలించారు.