VZM: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షలు కొత్తవలస భారత్ డిఫెన్స్ అకాడమీలో సోమవారం సజావుగా జరిగింది. మొత్తం 297 విద్యార్థులు కేంద్రానికి కేటాయించగా, అందులో 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అనారోగ్యానికి బారిన పడకుండా అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.