KNR: దేశంలోని ప్రజలు విద్యుత్ కొనుక్కునే స్థాయి నుంచి విద్యుత్ను అమ్ముకునే స్థాయికి చేరుకోవాలనేది దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రం జ్యోతి నగర్లో తన సొంత ఇంటి పై ‘పీఎం సూర్య ఘర్ ముఫ్ బిజిలి యోజన’ పథకంలో భాగంగా 10 KV యూనిట్ల విద్యుత్ సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసారు.