KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి పన్ను వసూలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మొండి బకాయిదారుల వివరాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించాలని సూచించారు.