TPT: వాకాడు (M) గొల్లపాలెంలో ఎస్సై నిఖిల్ కుమార్ నిన్న రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నాడు. నిన్న రాత్రిపూట అక్కడే బస చేసి నేరుగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలను పరిశీలిస్తూ, ప్రజలకు పారదర్శకమైన పాలనపై భరోసా కల్పించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల చెంతకు చేరేందుకే ఈ కార్యక్రమమని తెలిపారు.