PDPL: సింగరేణి RG-2 ఏరియా పరిధిలోని 2వ బొగ్గు గనిపై TBGKS ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, కార్మికుల సమస్యలు, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.