VKB: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలకు, అక్రమ రవాణాకు అధికారులు కళ్లెం వేస్తున్నారు. ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు కల్తీ ఆహార పదార్థాలతో పాటుగా అక్రమ ఇసుక, కలప, మట్టి దందాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 48 కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.