BPT: చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం పంచాయతీ పుషాడపువారిపాలెంలో శనివారం పశువైద్య ఉచిత శిబిరం నిర్వహిస్తున్నట్లు యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి శిబిరం మొదలవుతుంది. పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువుల ఆరోగ్య పరీక్షలు, ఔషధాల పంపిణీ ఉంటుందని తెలిపారు.