W.G: ఆకివీడులో పెదపేటలో శ్రీరామనవమి వేడుకల్లో శుక్రవారం జరిగిన ఘర్షణకు సంబంధించి ఐదుగురిని గాయపరచిన కేసులో 57 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంత నాగరాజు చెప్పారు. ఆకివీడు మండల పరిధిలో శుక్రవారం నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్సై వివరించారు. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించకూడదన్నారు.