KMR: రాజంపేట మండలంలోని కుమ్మరి కుంట ప్రాంతంలో పొలం పనుల్లో ఉన్న రైతులకు రెండు జింక పిల్లలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన రైతులు పుట్టా నర్సింలు, చింతల నరసింహులు, శ్రీను స్థానిక హెడ్ కానిస్టేబుల్ రమేష్కు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో ఆ జింక పిల్లలను సురక్షితంగా అటవీ శాఖ అధికారులకు అప్పగించి తమ ఉదారతను చాటుకున్నారు.