ELR: ఈనెల 29న టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. నిడమర్రులో సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వేడుకల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. ఆదివారం సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్న సభకు టీడీపీ కుటుంబ సభ్యులంతా హాజరవ్వాలని కోరారు.