KDP: గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నీరు విడుదల చేసినట్లు ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గండికోట జలాశయం నుంచి ఒక గేటు ఎత్తి 2500 క్యూసెక్కుల నీరు మైలవరం రిజర్వాయర్కు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 24.60 టీఎంసీల నీరు నిలువ ఉన్నట్లు ఈఈ వివరించారు.