VSP: జిల్లా పర్యటనలో భాగంగా ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.