PPM: పార్వతీపురం నుంచి వల్లరిగుడబ వరకు రూ.2 కోట్ల నాబార్డు నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు సైతం రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.