ADB: మాజీ మంత్రి సీ. రామచంద్రారెడ్డి (సీఆర్ఆర్) జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గండ్రత్ సుజాత, గోవర్దన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. రిమ్స్ ఏర్పాటు, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఆర్ఆర్ కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.