NLR: కలువాయి మండలం బీవీఎన్ఆర్ జడ్పీ హైస్కూల్ ప్లస్ వ్యాయామ ఉపాధ్యాయుడు నిడిగుంట రాజా జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రానికి కాంస్య పతకం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని హెచ్ఎం ఎస్వో అబ్బాస్ అలీ తెలిపారు. కలువాయి మండల ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు.