కోనసీమ: శ్రీరామనవమి సందర్భంగా అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శర్మ తెలిపారు. కళ్యాణం ముగిసిన తర్వాత భద్రాచలం నుంచి మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు వివిధ సమయాలలో పలు బస్సులు నడుస్తాయని తెలిపారు. ఇందులో ఇంద్ర ఏసి సర్వీస్ బస్సు కూడా అందుబాటులో ఉంటుందన్నారు.