GDWL: గద్వాల మండలం పూడూరు గ్రామ రహదారిలో అక్రమ మట్టి రవాణా విస్తృతంగా కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. కొందరు ట్రాక్టర్లతో నిత్యం మట్టిని తరలిస్తూ లాభాల వేటలో ఉన్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ఇష్టారీతిన వాహనాలు తోలడంతో రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.