HYD: జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. గత 4 నెలల్లో మొత్తం 45 అక్రమ భవనాలను గుర్తించి సీజ్ చేసినట్లు వెల్లడించారు. అనుమతులు లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.