Vsp: ఏయూ వసుదైక కుటుంబ భావనకు ప్రతీకగా నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 57 దేశాలకు చెందిన 1,150 మంది విద్యార్థులు ఇక్కడ చదవడం ఏయూ అంతర్జాతీయ ఖ్యాతికి నిదర్శనమని చెప్పారు.