శ్రీకాకుళంలోని రైతు బజార్ సచివాలయం పరిధిలో పుణ్యపు వీధి రహదారులు అధ్వానంగా మారాయి. అనేకచోట్ల కాలువ మీద పలకలు పాడైపోవడంతో రహదారి మీద వాహనదారులు ప్రయాణించడానికి అవస్థలు పడుతున్నామంటున్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారుల దృష్టికి స్థానికులు పలుమార్లు తీసుకువెళ్లినా తగిన రీతిలో సమస్యను పరిష్కరించటం లేదని అంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.