రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ‘వెంకీ’ మూవీ విడుదలై నేటితో 22ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది కేవలం సినిమా కాదు, ఒక మధుర ప్రయాణమని పేర్కొన్నాడు. సహజమైన నైట్ ఎఫెక్ట్ కోసం 70 రోజుల షూటింగ్లో, వరుసగా 40 రాత్రులు కష్టపడ్డామని వెల్లడించాడు. రవితేజ అందించిన తిరుగులేని సహకారం వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని అన్నాడు.