NGKL: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తన నియోజకవర్గ సమస్యలపై గళమెత్తారు. గురువారం సభలో ఆయన మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగునీటి వనరుల పెంపుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు కేటాయించాలని విన్నవించారు.