GNTR: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. లోకకళ్యాణం కోసం అవతరించిన శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు.