AP: రాజధానిలో జరిగిన వరుస అగ్నిప్రమాదాల కేసులో పురోగతి లభించింది. అగ్నిప్రమాద కారకుడైన వాచ్మెన్ రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23న పైపులకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. తుళ్లూరు పీఎస్కి రామును తరలించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు సీన్ రీ క్రియేట్ చేశారు. SP వకుల్ జిందాల్ ప్రత్యేకంగా ఈ కేసు విచారణ చేపట్టారు.