NRPT: పరిపాలనలో రెవెన్యూ వ్యవస్థ అత్యంత కీలకమని, అధికారులు పారదర్శకంగా పని చేసి ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లతో రెవెన్యూ శాఖపై తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని, సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల మేరకు పరిష్కరించాలని అన్నారు.