KMM: కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పులిగుండాల గ్రామాన్ని సందర్శించి అటవీ, సాగునీటి శాఖ అధికారులతో పాటు స్థానిక రైతులతో మాట్లాడారు. ప్రాజెక్టులో నీటి లభ్యతను సమీక్షించి, రబీ పంటల సాగుకు రైతులకు అవసరమైన సాగునీరు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటూ సాగునీటి నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.