ATP: జనగణన ప్రక్రియ ప్రభుత్వ ప్రణాళికల రూపకల్పనకు మార్గదర్శిగా నిలుస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మాలోల తెలిపారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఇండ్ల జాబితా, గణన ప్రక్రియపై శిక్షణ తరగతులను గురువారం ఆయన ప్రారంభించారు. మే 1 నుంచి 30 వరకు తొలి విడత గణన జరుగుతుందని, ఏప్రిల్ 16 నుంచి స్వీయ గణన అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.