MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ పశు ఆరోగ్య ఉప కేంద్రంలో పాడి రైతులకు సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేశారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 75% సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు సరఫరా కాగా సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి పాడి రైతులకు అందజేశారు. పశు ఆరోగ్య ఉప కేంద్రం పరిధి 9 గ్రామాల రైతులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.