NZB: సిరికొండ మండలం గడ్కోల్ రైతు వేదికలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు గురువారం శిక్షణ నిర్వహించారు. లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులపై ట్రైనర్లు బాలకృష్ణ, నరేశ్, నగేశ్ అవగాహన కల్పించారు. అయితే మొత్తం 88 మంది వార్డు సభ్యులకు గాను కేవలం 19 మంది మాత్రమే హాజరుకావడం గమనార్హం. ప్రజాప్రతినిధుల గైర్హాజరీపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు.