ATP: పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పు పెట్టిన ఘటన గురువారం జరిగింది. గ్రామానికి చెందిన దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి పశుగ్రాసం కోసం వీటిని ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.