AKP: కసింకోట మండలం తాళ్లపాలెం గ్రామంలో కొత్తగా నిర్మించిన మరిడిమాంబ అమ్మవారి ఆలయాన్ని బుధవారం వైభవంగా ప్రారంభించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, హోమం, తదితర కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. భక్తులు పలువురు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. జనసేన నియోజకవర్గం ఇంఛార్జ్ రాంకి అమ్మవారిని దర్శించుకున్నారు.