NRPT: మద్దూర్ మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామానికి చెందిన చిన్నారి ప్రసన్న థలసేమియా వ్యాధితో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న అభంగాపూర్ యువకులు బుధవారం తమ వంతు సహాయంగా రూ.31 వేలు కుటుంబ సభ్యులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సేవా భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు.