GNTR: కొల్లిపర గ్రామానికి చెందిన కొల్లి రామిరెడ్డి (85) ఆదివారం రాత్రి గుదిబండివారిపాలెంలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ భోజనం చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించగా, తీవ్ర గుండె నొప్పితో అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.