ELR: ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో బుధవారం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.150 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమని తెలిపారు.