WGL: ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఇవాళ కనులపండువగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు పంచామృతాభిషేకాలు నిర్వహించి, నూతన వస్త్రాలు, విశేష ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.