బాపట్ల జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు మొత్తం 15,944 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అన్ని వసతులు కల్పించామని అధికారులు తెలిపారు.