GDWL: జిల్లాలో చేనేత కలను నమ్ముకున్న కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో పర్యటించిన కలెక్టర్, చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి మగ్గాలను పరిశీలించారు. కార్మికులకు ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.