NGKL: వెల్దండ రైతు వేదికలో ప్రపంచ భూగర్భ జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారిణి దివ్య జ్యోతి, సర్పంచ్ మట్ట యాదమ్మ ముఖ్య అతిథులుగా హాజరై, భూగర్భ జలాల పెంపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుతూ, జల వనరులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.