KRNL: ఇళ్ల సమస్యపై ఆదోనిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ ఇవాళ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం ఖాళీ హామీలు ఇస్తోందని విమర్శించారు. పేదలకు ఇళ్లు, భూములు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. హామీలు వెంటనే అమలు చేయకపోతే పోరాటం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.