MDCL: హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆరు చెరువుల సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ద్వారా పనులు చేపట్టింది. తొలి దశలో రామంతపూర్ పెద్ద చెరువు అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాన రహదారులు, పార్కు సుందరీకరణ పనులను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.1.60 కోట్ల వ్యయంతో చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు ముగింపు దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.