NLR: ఉగాది పండుగ సందర్భంగా నెల్లూరు బాలాజీ నగర్లోని దివంగత బాలసుబ్రమణ్యం పార్కులో నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు సోమవారం రాత్రి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాది సంబరాల్లో భాగంగా క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు.